డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. రెండు శాతం రాయితీ..

6 months ago 7
డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలలోని మహిళలకు తీపికబురు వినిపించింది. వడ్డీల మీద రెండు శాతం రాయితీ ఇస్తోంది. డ్వాక్రా సంఘాల మహిళల బ్యాంక్ లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు తీసుకుంటూ ఉంటారు. వీటిపై 13, 12 శాతం వడ్డీ విధిస్తుంటారు. అయితే స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ రుణాల వడ్డీపై రెండు శాతం రాయితీ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ మేరకు డ్వాక్రా సంఘాలకు ఉపశమనం లభించనుంది. అయితే పావలా వడ్డీ రుణాలకు కేవలం మూడు లక్షల వరకే పరిమితి ఉండగా.. ఇప్పుడు ఎంత రుణం తీసుకున్నా కూడా వడ్డీలో రెండు శాతం రాయితీ లభిస్తుంది.
Read Entire Article