రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 500 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వందరోజుల జీవనోపాధుల కార్యక్రమం పేరుతో కొత్త ప్రణాళిక రచించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు 18 ఏళ్లకు పైబడిన, డ్వాక్రా సంఘాలలోని మహిళలు అర్హులు.