Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లబోతున్నారు. ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుని.. అక్కడ కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు, సహాయం కోరనున్నారు. 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. గోదావరి-బనకచర్ల ఎత్తిపోతల పథకానికి ఆర్థిక సహాయం కోరుతూ నిర్మలా సీతారామన్కు నివేదిక అందజేయనున్నారు. అంతకుముందు, చంద్రబాబు కుప్పంలో గంగమ్మను దర్శించుకుంటారు.