Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటన ఖాయమైంది. మే 30న ఢిల్లీలో సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొంటారు, కేంద్ర మంత్రులను కలిసి విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. మే 31న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం, కాట్రేనికోన మండలం చెయ్యేరులో 'పీ4' కార్యక్రమంలో పాల్గొంటారు.