ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. పిఠాపురంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గురించి చర్చించారు. పవన్ కళ్యాణ్ వినతులపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.