హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం, జీవన పరిస్థితులు క్షీణిస్తున్నాయన్నారు. హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకుండా తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. హైడ్రా కేవలం కూల్చివేతల కోసం కాదని.. ప్రజల ఆస్తుల రక్షణ కోసమని స్పష్టం చేశారు.