ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించడంతో.. ఆయనతో సమావేశం అయ్యేందుకు నారా లోకేష్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ కానుండగా.. రేపు హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఏం చర్చించనున్నారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.