ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన వేళ.. అటు దేశ రాజకీయాల్లోనే కాదు.. ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందని, కాంగ్రెస్ ఘోర పరాజయం పొందుతుందని తమకు ముందే తెలుసంటున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీ మీదే అవినీతి ఆరోపణలు చేస్తూ పుట్టుకొచ్చిన ఆప్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందని ఆరోపించారు.