Nara Lokesh Meet Pm Modi In Delhi: అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్సభ ఆమోదించడంపై మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ హాలులో మంత్రి లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మంత్రి లోకేష్ లోక్సభ స్పీకర్, పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిశారు.