సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. రేవంత్ రెడ్డిని కలిశారు. వీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ ఇద్దరు నేతలు పార్లమెంటుకు వెళ్లిన సమయంలో ఎదురుపడగా.. ఈ సంఘటన జరిగింది. గతంలో రేవంత్, రోజా.. టీడీపీలో పనిచేశారు.