TTD New Delhi Sv College: ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాలను మరింత అభివృద్ధి చేయాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, తెలుగు విద్యార్థులకు ప్రాధాన్యత, నూతన కోర్సుల ప్రవేశం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఉత్తరాది ఆలయాల ఇంజనీరింగ్ పనుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.