తండ్రిని చంపేసి సెకండ్ షో సినిమాకు వెళ్లింది..

8 months ago 14
తన అఫైర్‌కి అడ్డొస్తున్నాడని కన్నతండ్రిని ప్రియుడు, తల్లితో కలిసి హత్య చేసిన కుమార్తె.. సెకండ్‌ షో సినిమాకు వెళ్లి వచ్చిన తర్వాత శవాన్ని క్యాబ్‌లో తీసుకొచ్చి చెరువులో పడేసింది. ఈ దారుణ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో జరిగింది. ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌ చెరువులో ఈనెల 7న ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈతగాళ్లతో వెలికి తీయించారు. ఒంటిపై గాయాలుండటంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. అతడ్ని హైదరాబాద్‌ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన 45 ఏళ్ల వడ్లూరి లింగంగా గుర్తించారు. ఆయనకు కల్లుతాగే అలవాటు ఉందని, అందరితో గొడవ పడేవాడని భార్య శారద, కుమార్తె మనీషా చెప్పారు. ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లినట్టు పోలీసులకు తెలిపారు. వారి మాటలపై అనుమానం వచ్చి చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.
Read Entire Article