సంగారెడ్డి జిల్లాలో ఒక ఆర్ఎంపీ దారుణానికి ఒడిగట్టాడు. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్తాపం చెందిన సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలైన రిథిక్, ఆరాధ్యలకు ఉరేసి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.