Chandrababu On Tribals Bandh: ఏపీలో గిరిజనులు 48 గంటల పాటూ బంద్ పాటిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంద్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బంద్పై స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము అన్నారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అపోహలు అవసరం లేదన్నారు. 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు చంద్రబాబు.