కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ సుష్మ భూపతి చేసిన వీడియోపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆమె వీడియో రిలీజ్ చేయగా.. దానిపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దీంతో సుష్మ యూటర్న్ తీసుకుంది. తనకు కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి నాలెడ్జ్ లేదని.. తనన క్షమించాలని కోరుతూ మరో ఆడియో విడుదల చేసింది.