ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి పుట్టినరోజున గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జూపార్క్లోని రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటికి సంబంధించిన అన్ని ఖర్చులను తానే భరిస్తానని చెప్పి తన ఉదారతను చాటుకున్నారు. జంతు సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో ఆయన సీతాకోకచిలుకలతో గడిపిన దృశ్యాలు, ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ప్రారంభోత్సవం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.