Sitanagaram Talliki Vandanam Money To Father: తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు వింత కోరికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన 'తల్లికి వందనం' డబ్బులు తమ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కారణం వారి తల్లిదండ్రులు విడిపోయి ఉండటమే. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని, ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడతాయని వారు ఎంపీడీవోను వేడుకున్నారు. మరి ఈ విచిత్ర పరిస్థితికి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.