Talliki Vandanam Scheme 2025 Complaint: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ చేసింది. కొందరికి డబ్బులు రాకపోవడంతో, అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 20 వరకు ఉంటుంది. ఒకటో తరగతి, ఇంటర్ విద్యార్థులకు జూలై 5న డబ్బులు జమ చేస్తారు. అర్హత ఉండి డబ్బులు రానివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.