Talliki Vandanam Scheme 2025 Status: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.13,000 చొప్పున జమ అవుతున్నాయి. డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి వెబ్సైట్, వాట్సాప్ సదుపాయం ఉంది. అర్హత ఉండి డబ్బులు రానివారు ఫిర్యాదు చేయవచ్చు. నలుగురు పిల్లలున్న తల్లికి రూ.60 వేలు జమ చేసినట్లు టీడీపీ తెలిపింది. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొంది.