ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ నెరవేర్చింది. సూపర్స్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకం అమలు ప్రారంభించింది. జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభమైంది. 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించనున్నారు. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13000 జమ చేయనున్నారు. రూ.2000 పాఠశాల అభివృద్ధికి వినియోగించనున్నారు. అయితే తల్లికి వందనం పథకం అర్హతలు, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.