Talliki Vandanam Scheme 2025 Another Chance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేసింది. అర్హుల జాబితాలో పేరు ఉండి డబ్బులు రానివారు గ్రీవెన్స్ ద్వారా విన్నవించాలని అధికారులు సూచించారు. జూన్ 20 గ్రీవెన్స్ స్వీకరణకు చివరి తేదీ. జూలై 5న మిగిలిన అర్హులకు డబ్బులు జమ చేస్తారు. అర్హత ఉండి జాబితాలో పేరు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ ఎల్పీఎం నంబర్ల సమస్యతో అనర్హులైన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.