Talliki Vandanam Scheme 2025 Key Update On Pending Money: తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా కొంతమంది తల్లుల ఖాతాల్లో జమ కాలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. సుమారు 1.39 లక్షల మంది తల్లులకు ఈ సమస్య ఎదురైంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు జమ కాలేదని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు, ప్రైవేట్ స్కూల్స్ లో RTE కింద అడ్మిషన్ పొందిన విద్యార్థుల ఫీజులు కూడా చెల్లించాల్సి ఉందని తెలిపారు.