Talliki Vandanam Scheme 2025 Rs 13000 Only: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 'తల్లికి వందనం' పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. అర్హులైన తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.