బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం ద్వారా రూ.13000 జమ చేసింది. అయితే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఒక మహిళ తన కుమారుడికి వచ్చిన డబ్బును, మరో రెండు వేలు కలిపి పాఠశాల అభివృద్ధికి విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు చాలని, ఈ డబ్బును పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని ఆమె కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.