జోగుళాంబ గద్వాలలో చోటు చేసుకున్న నవ వరుడు తేజేశ్వర్ (32) హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లైన నెలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిద్దరూ ఒక బ్యాంకు ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విచారణలో తేలింది. తేజేశ్వర్ను హత్య చేసేందుకు సదరు బ్యాంకు ఉద్యోగి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.