కామారెడ్డి జిల్లాలో విషాదకర గటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తల్లీకూతురు నిద్రలోనే మృతి చెందారు. రాత్రి నిద్రపోయే సమయంలో కూలర్ ఆన్ చేయగా ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావటంతో తల్లీ కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.