ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అలాగే పెట్టుబడుల ఆకర్షణకు కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజ్ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాకినాడ తీరంలో పర్యాటక ప్రాజెక్టును చేపట్టేందుకు తాజ్ గ్రూప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల కాకినాడ తీరాన్ని సందర్శించి వెళ్లారు. అయితే కాకినాడ తీరం సమీపంలో 30 ఎకరాలను తాజ్ గ్రూప్ అడుగుతుండగా.. ఆ స్థాయిలో ఖాళీ భూమి అందుబాటులో లేకపోవటంతో ప్రాజెక్టుపై సందిగ్ధత కొనసాగుతోంది.