తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలల్లో ఆఖరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటుగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నప్రసాద కేంద్రాలు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచుతోంది. నవంబర్ 25న పంచమీ తిర్థం కార్యక్రమం జరగనుంది.