తిరుమల-తిరుపతి హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి చోట మహావిష్ణువు విగ్రహం చెత్తా చెదారం మధ్య పడి ఉందనే వార్త అందర్నీ కలచి వేసింది. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ ఈ విగ్రహాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. అయితే అది శనీశ్వరుడి విగ్రహం అని విష్ణుమూర్తి విగ్రహం కాదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. అయినా సరే విగ్రహం చేతుల్లో శంఖు, చక్రాలు ఉండటంతో చాలా మందికి అనుమానం తీరలేదు.