తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి.. అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య..!

1 year ago 34
Couple Suicide at Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. తిరుమలలోని నందకం గెస్ట్‌హౌస్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, అతని భార్య అరుణ నందకం అతిథిగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసులు కొద్దికాలం కిందటే హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ చేసినట్లు తెలిసింది. గెస్ట్ హౌస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article