తిరుపతి: పాల కోసం ఏడుస్తోందని.. ఆరు నెలల పసికందును చంపేసిన కన్నతల్లి

4 months ago 26
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పాపను కన్నతల్లే దారుణంగా చంపేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను పాలిచ్చి, ఊరడించాల్సిన తల్లి.. క్షణికావేశంలో తన పేగుబంధాన్ని తానే చేజేతులా చేసుకున్న వైనం.. ఆ కన్నతల్లి ఉన్మాదం స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల్లి హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article