దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలుకు మరో స్టాపేజీ కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి నిజామాబాద్ మధ్య ప్రయాణించే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈ నెల 20వ తేదీ నుంచి.. నవాండ్గి రైల్వే స్టేషన్లోనూ ఆగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇప్పటికే నిజామాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే రైలు నవాండ్గి స్టేషన్లో ఆగుతోందని తెలిపారు.