Tirupati Greater Municipality Upgrade: ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తిరుపతి గ్రేటర్ సిటీగా మారనుంది. ఈ మేరకు గ్రైటర్ తిరుపతి ఫైల్ అమరావతికి చేరినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 63 గ్రామ పంచాయతీలు విలీనం కానున్నాయి, నగరం విస్తీర్ణం 284 చ.కి.మీ.కి పెరుగుతుంది. స్మార్ట్సిటీగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో పెరుగుతున్న జనాభా, భక్తుల సంఖ్య దృష్ట్యా భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విస్తరణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.