తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే కొన్ని బస్సుల్లో ప్రయాణికులకు 30 శాతం వరకు రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. లహరీ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారికి 10 శాతం రాయితీ ప్రకటిస్తూ.. పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.