Tirupati Travels Bus Theft: తిరుపతిలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హఠాత్తుగా మాయమైంది. చింతల చేను ప్రాంతంలో పార్క్ చేసిన బస్సును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లడంతో కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తుండగా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కడప జిల్లా ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైందని సమాచారం వచ్చింది.. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ ప్రమాదంలో బస్సు ధ్వంసమైనట్లు గుర్తించారు.