Tirumala Anna Prasadam Vada Added: టీటీడీ అన్నదానం మెనూలో మసాలా వడను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది నవంబర్లో జరిగిన పాలకమండలిలోనే ఈ మేరకు తీర్మానం అమలు చేశారు. గత కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగతో పాటు చక్కెర పొంగలి భక్తులకు వడ్డిస్తుండగా.. ఇప్పుడు వడ కూడా చేరింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.