తిరుమలలో బుధవారం కలకలం రేగింది. అవ్వచారి కోన లోయలోకి ఓ వ్యక్తి దూకి ఆత్యహత్యాయత్నం చేశాడు. అలిపిరి మెట్లమార్గంలోని అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రెస్క్యూబృందం లోయలోకి దిగి ఆ వ్యక్తి కోసం గాలిస్తోంది. ఆ వ్యక్తి ఎవరనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.