Newly Wed Photoshoot In Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో టీటీడీ నిబంధనల్ని భక్తులు పట్టించుకోవడం లేదు. తాజాగా కొత్తగా పెళ్లైన జంట ఆలయం ముందు ముద్దులు పెట్టుకుంటూ ఫోటోషూట్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ ప్రసంగాలు, ఫోటోషూట్లు నిషేధించినా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.