వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో ప్రమాదకర రసాయనాలు వాడారంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సిట్ నివేదికపై స్పందించిన ఆయన.. విలేకర్ల సమావేశంలో వైసీపీపై పలు ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమలలో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని బీఆర్ నాయుడు ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో మహాపాపం చేశారన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఈ అక్రమాల వెనుక ఉన్న పెద్దవాళ్ల పేర్లు బయటపెట్టాలని సీబీఐను కోరారు.