తిరుమల కొండల్లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. శిలాతోరణం, శ్రీవారి పాదాల వద్ద మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, గతంలో లడ్డూ కౌంటర్లోనూ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.