కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు. అలాగే సిఫారసు లేఖల ద్వారా శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సిఫార్సు లేఖల ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ వసతి గదులు కూడా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంలో టీటీడీ స్వల్పమార్పులు చేసింది. శనివారం నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో తిరుమలలో వసతి గదుల కోసం వీరు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన ఇబ్బంది తప్పనుంది.