TTD Job To Stampede Victims Family Member: జనవరి నెలలో తిరుపతిలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసిందే. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టోకెన్ల జారీ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు టీటీడీ, ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు చనిపోయినవారికి రూ.25 లక్షలు పరిహారం, ఆ కుటుంబంలో పిల్లల్ని చదివించడం, టీటీడీలో ఉద్యోగంపై హామీ ఇచ్చారు. తాజాగా దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.