TTD Chairman Announce Free Meals Vontimitta Temple: కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తిరుమల తరహాలో ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలని ఆయన కోరారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు త్వరలో అన్నప్రసాదం ప్రారంభిస్తామని తెలిపారు. ఒంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఆయుర్వేద మొక్కలు నాటనున్నట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీరాముడు చూపిన మార్గంలో ప్రజలు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.