Vijayawada Durga Temple Two Doctors Allotted: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ఇకపై భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తరహాలో వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను నియమించింది. గతంలో సరైన వైద్యులు లేక భక్తులు ఇబ్బందులు పడేవారు. దసరా ఉత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో ఇప్పటికే నర్సింగ్ సిబ్బంది, అంబులెన్స్ సేవలు ఉన్నాయి. కొత్త డాక్టర్ల నియామకంతో భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందంటున్నారు.