AP Govt Focus On 22 Temples Management:ఏపీ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నడుం బిగించింది. తిరుమల తరహాలో 22 ప్రముఖ దేవాలయాల్లో భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిశుభ్రత, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది. అంతేకాదు, ఒంటిమిట్ట రాములోరి ఆలయంలో అన్నప్రసాదం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా భక్తులకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.