శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలంలో చెంచులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. చెంచులకు ఉచిత స్పర్శ దర్శనాన్ని శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రారంభించారు. మంగళవారం రోజున 500 మంది చెంచులు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి నెలా ఒకరోజు చెంచులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు.