Tirumala TTD CVSO On Fake Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నకిలీ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ సీవీఎస్వో కెవి మురళీ కృష్ణ హెచ్చరించారు. గతంలో మోసం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని, దళారులపై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.