తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి.. ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీగా సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి ఉండగా.. కొందరు మాత్రం పక్క నుంచి వెళ్లిపోవడం కనిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించకుండా.. పక్క నుంచి బీజేపీ నేతలు దర్జాగా వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ వీడియో ఎప్పటిది. అందులో ఉన్నవారు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.