TTD Aadhaar Authentication Verification: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలమంది భక్తలు వస్తుంటారు. అయితే తిరుమల దర్శనాలు, వసతి గదులు, ఆర్జిత సేవల విషయంలో పారదర్శకత కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీని అమలు చేసేందుకు సిద్ధమైంది. కొందరు వ్యక్తులు టీటీడీ లక్కీ డిప్ కోసం బల్క్గా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. అలా డిప్ ద్వారా వచ్చిన టికెట్లను ఎక్కువ ధరలకు బ్లాక్లో అమ్మేస్తున్నారు.. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.