ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఏడుకొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించరాదని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే భూముల కేటాయింపులు, బదలాయింపులపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణం వివాదాస్పదమైన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.